సంగారెడ్డి: పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ లారీకి అనుకోకుండా మరో లారీ అడ్డంగా వచ్చిన ఘటనలో రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. అదే సమయంలో రోడ్డు దాటుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అనుకోకుండా ఈ రెండు లారీల మధ్య ఇరుక్కుపోయాడు. అయితే అదృష్టవశాత్తుగా ఆ వ్యక్తి ఎలాంటి గాయాలపాలుకాకుండా అంత భారీ ప్రమాదం నుంచి తృటిలో  బతికిబయటపడ్డాడు. రెండు లారీలు ఒకదానినొకటి ఢీకొన్న దృశ్యాలు అక్కడి చౌరస్తాలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం కారణంగా రెండు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో సంగారెడ్డి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. Read also : కృష్ణా నదిలో దూకిన వివాహిత.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సంగారెడ్డి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన రెండు లారీలను రోడ్డుపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.