న్యూయార్క్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు  ఘటనలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. మాన్‌హట్టన్‌ పోర్టు అథారిటీ బస్సు టెర్మినల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు సమయంలో బస్సు టెర్మినల్‌ వద్ద ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. తాజా ఘటన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఘటనా స్థలంలో ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.  ఘటనకు సంబంధించిన  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.