Alert for Americans: కరోనా మహమ్మారి భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలో ఉన్న భయానక పరిస్థితుల నేపధ్యంలో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో ఉన్న తమ దేశీయుల్ని వచ్చేయమంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)దేశంలో భయంకరంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఇప్పటివరకూ అత్యధికంగా అంటే 3 లక్షల 79 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ దేశంలో అదుపులో రావడం లేదు. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నా..మరికొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ప్యూలు పాటిస్తున్నా సంక్రమణ ఆగడం లేదు. పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. దేశంలోని ఆసుపత్రులన్నీ కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో యూఎస్ ప్రభుత్వం ( US Government) ఇండియాలోని తమ దేశీయుల్ని అప్రమత్తం చేస్తోంది.


ఇండియాలో పరిస్థితులు బాగాలేవని..ఈ పరిస్థితుల్లో అక్కడుండటం మంచిది కాదని వీలైనంత త్వరగా ఆ దేశం నుంచి బయటపడాలని అమెరికా(America) కోరుతోంది. అటు అమెరికా నుంచి ఇండియాకు కూడా వెళ్లవద్దంటోంది. అమెరికాకు ప్రతిరోజూ ఇండియా నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని..యూరప్ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులున్నాయని వివరాలు కూడా అందిస్తోంది. యూఎస్( US) సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష్ (CDC)హెల్త్ నోటీసు కూడా జారీ చేసింది. అమెరికన్లు కొన్నిరోజుల వరకూ ఇండియాకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతోంది. మొత్తానికి దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు ఇతర దేశాల్ని అప్రమత్తం చేస్తున్నాయి.


Also read: Oxygen Tankers: బ్యాంకాక్, సింగపూర్ నుంచి ఇండియాకు ఆక్సిజన్ ట్యాంకర్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook