Adityanath Das appointed AP CS | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) ఆదిత్యనాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ప్రభుత్వం ఆదిత్యనాథ్‌ దాస్‌ (Adityanath Das) కు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు (AP Govt) సినీయర్ ఐఏఎస్ అధికారిని నియమించింది. Also Read: Narendra Modi: ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రతిఫలాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని (Nilam Sawhney) విధులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం (AP CMO) ఆదేశాలిచ్చింది. 


Also read: YS Jagan Birthday: రక్తదానంలో వైఎస్ఆర్‌సీపీ వ‌ర‌ల్డ్ రికార్డ్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook