ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (Andhra Pradesh corona Cases) బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఏపీలో 182 కరోనా పాజిటివ్ కేసులు (AP COVID19 Cases) నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,429కి చేరింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు. కృష్టా జిల్లాలో ఒకరు కరోనా బారిన పడి చనిపోయారు. ఈ వివరాలను ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఉంటున్న వారి కేసులు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వస్తున్న వారి కేసులను వేరువేరుగా బులెటిన్‌లో ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రేయసితో సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్‌మెంట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గడిచిన 24 గంటల్లో 11,602 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో ఉన్నవారిలో 135 కోవిడ్ పాజిటివ్ కేసులు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స అనంతరం 2,540 మంది డిశ్ఛార్జ్‌ కాగా, ప్రస్తుతం 1,641 మంది చికిత్స పొందుతున్నారు.  భార్యకు కరోనా పాజిటివ్.. భయంతో భర్త మృతి


కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకూ 197 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి 21 మంది కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 971 మందికి కరోనా పాజిటివ్‌ తేలగా, ప్రస్తుతం 564 యాక్టీవ్‌ కేసులున్నాయి. తాజాగా 31 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్