Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ మంత్రులతో కీలక సమావేశం కానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకట రమణలు జగన్‌కు స్వాగతం పలికారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై వివిధ మంత్రులతో చర్చించనున్నారు. రెండ్రోజుల పర్యటనలో (Delhi Tour) భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తదితరుల్ని కలవనున్నారు. 


ముందుగా పోలవరం ప్రాజెక్టుకు(Polavaram Project) సంబంధించి జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ కానున్నారు. పోలవరం నిధులు, పెండింగ్ అంశాల్ని చర్చిస్తారు. పోలవరంతో సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అనంతరం విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. చివరిగా రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit shah) భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలపై కేంద్ర సహకారాన్ని కోరనున్నారు. రెండవ రోజు అంటే రేపు ఉదయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం అంటే రేపు మధ్యాహ్నం ఏపీకు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, బాలశౌరిలు ఉన్నారు. 


Also read: AP Curfew Timings: రేపట్నించి ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు, కొత్త టైమింంగ్స్ ఇవీ