Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. సంక్రాంతి సంబరాలతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పండుగ సంక్రాంతి అత్యంత ఘనంగా జరుగుతోంది. భోగి మంటలు, భోగిపళ్లతో తొలిరోజు గడిపిన ప్రజలకు సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు. పల్లెలన్నీ సంక్రాంతి వేడుకలతో కళకళలాడుతున్నాయి. ప్రతి ఇంటా ముగ్గులు, గొబ్బెమ్మలు కన్పిస్తున్నాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంప్రదాయపు చిహ్నమైన కోడి పందేలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys jagan)సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగతో, సంబరాలతో ప్రతి ఇంట్లోనూ సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుతూ ట్వీట్ చేశారు.



వైఎస్ జగన్ చేసిన ట్వీట్


మన సంస్కృతి, సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనం ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగమంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..ప్రజలందరికీ భోగి, మంకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.


Also read: Kodi Pandalu: ఢీ అంటే ఢీ అన్న కోడి..ఈసారి పందేలు 450 కోట్ల పైమాటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి