Polavaram project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటన చేపట్టారు. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి జీవధారగా ఉన్న పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా అధికారులు సమీక్షించారు. 


Also read: AP Corona Update: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook