AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. వారం రోజుల్నించి కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఏపీలో ఇప్పుడు కాస్త శాంతిస్తోంది.కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగా చేస్తున్నా..పాజిటివ్ కేసులు మాత్రం తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93 వేల 704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 వేల 303 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అదే విధంగా కరోనా కారణంగా  గత 24 గంటల్లో 104 మంది మరణించారు. అదే సమయంలో గత 24 గంటల్లో 18 వేల 257 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో 15 లక్షల 46 వేల 617 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1 లక్షా 46 వేల 737 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 93 లక్షల 50 వేలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) చేశారు. 


Also read: Anandaiah Corona Medicine: ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తారు..ఏ మందు దేనికి వాడాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook