AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి నియంత్రణకై విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలనిస్తోంది. కరోనా కేసుల్లో నెమ్మదిగా తగ్గుదల కన్పిస్తోంది. అటు రికవరీ రేటు పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో నమోదైన కేసుల సంఖ్య..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic)నియంత్రణకు వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్, కర్ఫ్యూ సత్ఫలితాలనిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా కేసుల్లో క్రమేపీ తగ్గుదల కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. ఏపీలో కరోనా నియంత్రణకు రోజుకు 18 గంటల కర్ప్యూ అమలవుతోంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల్నించి 12 గంటల వరకూ మాత్రమే నిత్యావసర, వ్యాపారాలకు అనుమతి ఉంది. మధ్యాహ్నం 12 గంటల్నించి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కఠిన కర్ఫ్యూ అమలవుతోంది.


కరోనా నియంత్రణకై ఏపీ ప్రభుత్వం(Ap government)తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 72 వేల 979 కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) నిర్వహించగా 15 వేల 284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. అటు గత 24 గంటల్లో 20 వేల 917 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇప్పటివరకూ రాష్ట్రంలో 16 లక్షల 6 వేల మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 106 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 10 వేల 328 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 లక్షల 97 వేల మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1 లక్ష 98 వేల యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 1 కోటి 87 లక్షల 49 వేల 201 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. 


Also read: HPCL Plant Accident: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం, ప్రమాదంలో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook