AP Exams: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మరోసారి పరీక్షలు వాయిదా పడ్డాయి. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా విద్యార్దులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. విద్యార్ధుల ప్రతిభకు ముఖ్యమైన పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020 విద్యాసంవత్సరంలో పరీక్షల్లేకుండానే  పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని పాస్ చేయించిన పరిస్థితి. ఇప్పుడు 2021 విద్యా సంవత్సరంలో కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీలో వాయిదా పడ్డాయి. పదవ తరగతి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభం కావల్సి ఉంది. అయితే కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాల్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (Adimulapu Suresh)వెల్లడించారు. 


పరిస్థితులు అనుకూలించిన తరువాత పదవ తరగతి పరీక్షల్ని నిర్వహిస్తామని మంత్రి సురేశ్ (Adimulapu Suresh) తెలిపారు. వాయిదా పడిన ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ తప్పనిసరని మంత్రి తెలిపారు. విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని..ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. జేఈఈ, నీట్ వంటి ఎంట్రన్స్ పరీక్షలకు మార్కులు అవసరమన్నారు. 


Also read: AP High Court: ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook