ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్, నగర పంచాయితీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించింది. నెల్లూరు కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో నెల్లూరు కార్పొరేషన్ (Nellore Corporation)సహా 13 మున్సిపాల్టీలు, నగర పంచాయితీలతో పాటు 10 మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌ను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారు. మరోవైపు కుప్పం, ఆకివీడు, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.


రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress party) భారీ విజయం సాధించింది. తాడిపత్రి మున్సిపాల్టీ మినహాయించి మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వివిధ కారణాలతో మిగిలిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఇప్పుడు పూర్తయ్యాయి.


Also read: Kuppam: చంద్రబాబుకు షాక్, కుప్పం మున్సిపాల్టీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook