AP Corona Update: కరోనా మహమ్మారి తగ్గుదల కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి తగ్గుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా వైరస్ కేసులు పెద్దఎత్తున తగ్గడంతో రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూను కూడా తొలగించారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 2 వేల 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు 15 మంది మరణించారు. గత 24 గంటల్లో 2 వేల 440 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 16 వేల 459 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13 వేల 256 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల 155 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 41 లక్షల 34 వేల 961 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు.


Also read: Eluru Result: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook