CM Jagan: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్(AP CM Jagan) ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana health) శనివారం (నవంబర్ 20) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కైకాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. బీపీ లెవల్స్ పడిపోవడంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కైకాల ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 


Also Read: నాన్న గారి ఆరోగ్యంపై దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు... కైకాల కుమార్తె రమాదేవి విజ్ఞప్తి..


వదంతలు నమ్మెుద్దు: కైకాల కుమార్తె
సత్యనారాయణ ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులపై ఆయన కుమార్తె కైకాల రమాదేవి(Kaikala Satyanarayana Daughter) మంగళవారం స్పందించారు.‘''‘సత్యనారాయణగారి పరిస్థితి బాగానే ఉంది. నాన్నగారు కోలుకుంటున్నారు. బాగానే స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎవర్నీ ఆందోళనకి గురిచేయొద్దు'' అని విజ్ఞప్తి చేశారు రమాదేవి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook