Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను హెచ్చరిక జారీ అవుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో మరి కొద్దిరోజులు భారీ వర్షాలు(Heavy Rains) తప్పవని తెలుస్తోంది. బంగాళాఖాతంలో మరీ ముఖ్యంగా దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అండమాన్‌కు చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. మరో 48 గంటల తరువాత ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. అనంతరం తుపానుగా మారేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం కదలికను బట్టి పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు.


గత కొద్దిరోజులుగా ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఈసారి తుపాను ముప్పు(Cyclone Alert) ఉత్తరాంధ్ర తీరంపై ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా కాకినాడ నుంచి ఒడిశా వరకూ ప్రభావం ఉండవచ్చని అంచనా. తుపానుగా మారిన తరువాత డిసెంబర్ 2 నుంచి ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. మరోవైపు కోమరిన్, శ్రీలంక తీరప్రాంతంపై కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకూ భారీ వర్షాలు కొనసాగవచ్చు. 


Also read: AP Corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 101 మందికి పాజిటివ్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook