AP Corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 101 మందికి పాజిటివ్​

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 138 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 06:43 PM IST
  • ఏపీలో తగ్గిన కరోనా కేసులు
  • చివరి 24 గంటల్లో ఒకరు మృతి
  • కొవిడ్ నుంచి కోలుకున్న 138 మంది
AP Corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 101 మందికి పాజిటివ్​

AP Corona cases: ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్తగా 101 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) తెలింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 18,730 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ కేసులు బయపడ్డట్లు వెల్లడించింది ఏపీ ఆరోగ్య శాఖ.

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కొవిడ్ కారణంగా ఒకరు మరణించినట్లు ఏపీ (Corona deaths in AP) ఆరోగ్య శాఖ వివరించింది. కృష్ణా జిల్లాలో ఈ మరణం సంభవించినట్లు తెలిపింది.

ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 138 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.

ఇక ఇప్పటి వరకు మొత్తం 3,03,91,157 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. అందులో 207,27,25 శాంపిళ్లు పాజిటివ్​గా తెలినట్లు వివరించింది. ఇక ఇప్పటి వరకు 205,61,84 మంది కరోనాను జయించగా.. 14,439 మంది కొవిడ్​కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,102 యాక్టివ్ కరోనా (Corona Active cases in India) కేసులున్నాయి.

మొత్తం కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన వారితో పాటు.. ఏపీకి వచ్చిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల వారు కూడా ఉన్నట్లు వెల్లడిచింది ఆరోగ్య శాఖ.

కరోనా పరిస్థితులు ఎక్కడ ఎలా?

ఇప్పటి వరకు తూర్పు గోదావరిలో అత్యధికంగా 2,94,665 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే జిల్లాలో అత్యధికంగా 386 యాక్టివ్ కేసులు ఉన్నాయి చిత్తూరులో అత్యధికంగా 1,954 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు.

ఏపీ వ్యాప్తంగా విజయనగరం జిల్లాలో కరోనా కేసులు(83,052), యాక్టివ్ కేసులు (32) అత్యల్పంగా ఉన్నాయి.

దేశంలో ఇలా..

దేశవ్యాప్తంగా చూస్తే.. గడిచిన 24 గంటల్లో 8,309 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది కొవిడ్​కు బలయ్యారు. 9,905 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Also read: Vizag Gas Leakage: విశాఖలో మరో గ్యాస్ లీకేజీ ఘటన-ఇద్దరు కార్మికులు మృతి

Also read: Kunool Bus Accident: అదుపు తప్పి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..10 మంది గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News