ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Guntur) సంభవించింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు వ్యక్తులు  మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జ‌గిత్యాల (Jagtial) జిల్లా ధ‌ర్మపురికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్లడించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


నలుగురు వ్యక్తులు హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రకాశం జిల్లా పామర్రు వైపుగా కారులో వెళ్తున్నారు. గుంటూరు జిల్లాకు చేరుకోగా, రొంపిచర్ల - సుబ్బయ్య పాలెం మధ్య అదుపుతప్పిన కారు తంగేడుపల్లి పెద్ద కాల్వలోకి దూసుకెళ్లింది. నీట మునగడంతో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారని పోలీసులు భావిస్తున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe