Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా కోస్తాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. రానున్న 48 గంటల వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Low Depression)మరింతగా విస్తరించింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి సైతం ఏర్పడింది. ఫలితంగా రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుంది. అల్పపీడనం కారణంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఫలితంగా రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5. కిలోమీటర్ల సమీపంలో ఉంది. అటు తూర్పు-పశ్చిమ ద్రోణి సగటు సముద్రమట్టం కంట ఎత్తులో ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం రెండూ కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతంతో లక్షద్వీప్ ప్రాంతం సంబంధం కలిగి ఉందని వాతావరణ శాఖ(IMD)తెలిపింది. ఈ రెంటి కారణంగా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Heavy Rains)పడనున్నాయి. 


Also read: IPL 2021 Final: ఐపీఎల్ 2021 ఫైనల్ పోరుకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఇదేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి