ఆంధ్ర ప్రదేశ్ లో ( Andhra Pradesh ) రోజు రోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు. తాజాగా తూర్పు గోదావరి లోని పిఠాపురం శాసన సభ్యుడు పెండెం దొరబాబుకు కోవిడ్-19 పాజిటీవ్ ( COVIDー19 ) అని తేలింది. ఈ విషయాన్ని పిఠాపురం గవర్నమెంట్ హాస్పిట్ ఛీఫ్ మెడికల్ ఆఫిసర్ విజయ్ శేఖర్ వెల్లడించాడు.



తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును మెరుగైన ఆరోగ్యసేవల కోసం బెంగుళూరుకు తరలించారు. కాకినాడ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక హెలికాప్టర్ లో తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు కరోనావైరస్ నుంచి కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందించనున్నారు (Coronavirus )