Indian Army: దారి తప్పిన చైనా పౌరులను ఆదుకున్న భారత సైన్యం

భారత దేశంపై చైనా ( China )ఎన్ని కుట్రలు చేసినా భారత్ మాత్రం మానవత్వం చాటడంలో ముందుంటోంది.

Last Updated : Sep 6, 2020, 02:11 PM IST
    • భారత దేశంపై చైనా ( China )ఎన్ని కుట్రలు చేసినా భారత్ మాత్రం మానవత్వం చాటడంలో ముందుంటోంది.
    • తాజాగా సిక్కిం లోని 17,500 అడుగుల ఎత్తులో ముగ్గురు చైనావాసులు దారితప్పడంతో వారికి అండగా నిలిచింది భారత సైన్యం.
Indian Army: దారి తప్పిన చైనా పౌరులను ఆదుకున్న భారత సైన్యం

భారత దేశంపై చైనా ( China )ఎన్ని కుట్రలు చేసినా భారత్ మాత్రం మానవత్వం చాటడంలో ముందుంటోంది. తాజాగా సిక్కిం లోని 17,500 అడుగుల ఎత్తులో ముగ్గురు చైనావాసులు దారితప్పడంతో వారికి అండగా నిలిచింది భారత సైన్యం ( Indian Army ) . వారికి ముందు వైద్య సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సెప్టెంబర్ 3న జరిగింది.

 

ఇండియన్ ఆర్మీ అందించిన వివరాల ప్రకారం దారితప్పిన చైనీయులకు సైనికులు ఆక్సిజన్ తో పాటు ఆహారం ( Food ) , వేడి దుస్తువులు అందించారు. తరువాత వారిని చైనా సైనికుల వద్దకు తీసుకెళ్లారు. తరువాత వారికి మార్గదర్శకం చేశారు.

ఈ విషయంపై భారత సైన్యం ఒక ట్వీట్ చేసింది

 

Trending News