TDP Mahanadu: టీడీపీ పండుగకు సర్వం సిద్ధమైంది. ఒంగోలులో ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రేపటి నుంచి టీడీపీ మహానాడు ప్రారంభంకానుంది. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఒంగోలు బాట పట్టారు. ఇటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు వెళ్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళగిరి నుంచి కార్లు, బైక్‌లతో ర్యాలీగా వెళ్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ వెంట ర్యాలీ సాగుతోంది. మార్గ మధ్యలో చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో భారీగా పార్టీ కార్యకర్తలు చేరారు. అక్కడి నుంచి మంగమూరు రోడ్డు, మున్సిపల్ కార్యాలయం, చర్చి సెంటర్ మీదుగా ఒంగోలుకు ర్యాలీ సాగుతుంది. అడుగడుగునా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.


సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. మహానాడుపై చర్చించనున్నారు. టీడీపీ పండుగలో ఎలాంటి నిర్ణయాలు, తీర్మానాలు చేయాలన్న దానిపై మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహానాడులో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఇప్పటికే నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


Also read:  Dry Fruits Eating Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!


Also read:Anasuya Bharadwaj Photos: సన్ షైన్ ఫొటోషూట్ లో హాట్ యాంకర్ అనసూయ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి