బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి సైతం పసిడి దారిలోనే పయనించింది.  విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.430 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,370 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపూ రూ. 400 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,010కి చేరింది.



 


ఢిల్లీ మార్కెట్‌లో గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.430 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.55,030కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,450 ధరలో మార్కెట్ అవుతోంది.


 



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) తాజాగా భారీగా పెరిగింది. దీంతో రూ.65 వేల మార్కు చేరుకుంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.900 మేర భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.65,400కు చేరుకుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe