బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case)లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకూ సుశాంత్ వాడిన సిమ్ కార్డులు అతడి పేరిట లేవని గుర్తించిన ముంబై పోలీసులు మరిన్ని విషయాలు సేకరించారు. నొప్పి లేకుండా చనిపోవడం ఎలా? అని సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మీడియాకు తెలిపారు.  తన మాజీ మేనేజర్ దిశా సలియన్ (ఆత్మహత్యకు) మరణానికి, తనకు లింక్ ఉందనే తరహా కథనాలను సుశాంత్ చదివాడని తెలిపారు. Sushant case: బలవంతంగా ఐపీఎస్ అధికారి క్వారంటైన్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చనిపోవడానికి ముందురోజు రాత్రి దాదాపు రెండు గంటలపాటు సుశాంత్ ఇంటర్నెట్‌లో తన గురించిన వివరాలు సెర్చ్ చేశాడని వెల్లడించారు. ఈ క్రమంలో అయిదు రోజుల ముందు జరిగిన మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు, సుశాంత్ సింగ్‌కు లింక్ ఉందా అనే కథనాలు చూసి తీవ్ర మనస్తాపానికి గురై ఉంటాడు. ఆ తర్వాత నొప్పి లేకుండా చనిపోవడం ఎలా, మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చా లాంటి కొన్ని ముఖ్య విషయాలు చనిపోవడానికి ముందురోజు రాత్రి నటుడు సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు కమిషనర్ వివరించారు.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...  


జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకోగా.. అంతకు 5రోజుల ముందు నటుడి మాజీ మేనేజర్ దిశా బలవన్మరణం చెందింది. ఆమె చనిపోయే ముందురోజు పార్టీకి తనకు కాబోయే భార్యతో హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి అతడి ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అందాల ‘దేశముదురు’ హన్సిక Photos