Tollywood: టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప సినిమాపైనే ఉంది. సుకుమార్, అల్లు అర్జున్న కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొత్తగా ఓ అప్‌డేట్ వస్తోంది. బాలీవుడ్ భామ సైతం ఈ సినిమాలో కన్పించనుందని..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్య 1, ఆర్య 2లతో రెండు సార్లు అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ హిట్టయింది. అందుకే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్న హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా(Pushpa Movie)పై భారీ అంచనాలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కన్పించనున్నాడు. హీరోయిన్‌గా రష్మిక మందన్నా సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప సినిమా విడుదలెప్పుడో గానీ..ప్రతిరోజూ ఒక్కొక్క అప్‌డేట్‌తో అంచనాల్ని పెంచుకుంటోంది సినిమా. 


పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ భామ ఎంటర్ టైన్ చేయనుంది. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ(Bollywood Actress Disha patani)ఐటెం సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ తొలిసారిగా ఈ సినిమాలో విలన్ పాత్రలో కన్పించబోతున్నాడు. మరోవైపు ఈ సినిమా రెండు సీక్వెల్స్‌లో రాబోతుంది. మొదటి భాగం అక్టోబర్ నెలలోనూ, రెండవ భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా మొదటి పార్ట్ విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. 


Also read: Mugguru Monagallu Trailer review: ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ రివ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook