Robbery in Sonam Kapoor House : బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా దంపతుల నివాసంలో రూ.2.4 కోట్ల విలువైన నగలు, నగదు మాయమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 11న చోరీ జరగ్గా... సోనమ్ కపూర్ అత్త ఫిబ్రవరి 23న ఈ ఘటనపై తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీ జరిగిన మరుసటి రోజు ఇంట్లోని అల్మారా తెరిచి చూడగా బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా నివాసంలో పనిచేస్తున్న 25 మంది సిబ్బందిని విచారిస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. చోరీ జరిగిన ఆ ఇల్లు ఢిల్లీలోని అమృత షేర్గిల్ మార్గ్‌లో ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో సోనమ్ కపూర్ మామ హరీష్ ఆహుజా, అత్త ప్రియ ఆహుజా ఉంటున్నారు. ఆనంద్ ఆహుజా నానమ్మ సర్లా ఆహుజా కూడా వారితో పాటే ఉంటున్నారు. 


ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ ఏడాది మార్చి 21న ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోలను సోనమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి  సంతోష సమయంలో సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరగడంతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే... సోనమ్ కపూర్ చివరిసారిగా దుల్కర్ సల్మాన్‌తో కలిసి 'జోయ ఫ్యాక్టర్' సినిమాలో నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. 


Also Read: Hyderabad: శ్రీరామ నవమి ఎఫెక్ట్... హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్...


Also Read: Pushpa Villain in Karimnagar: కరీంనగర్‌లో పుష్ప విలన్... ఇమిటేషన్ కాదు... ఏడేళ్లుగా ఇదే గెటప్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook