Mahesh Babu-Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ సెట్ అయినప్పటికీ.. అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెర పైకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్‌తో రాజమౌళి మూవీ ఈ ఏడాదే ప్రారంభం కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. 2024లో దసరా పండగ సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం కథను సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సినిమా ఉండొచ్చునని గతంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత ఏడాది వరకు రాజమౌళికే డేట్స్ కేటాయిస్తారని చెబుతున్నారు. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా మార్చికి వాయిదా పడింది. ఎన్టీఆర్-చెర్రీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: INDW vs PAKW: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న పూజా, స్నేహ్.. పాకిస్తాన్‌కు భారీ టార్గెట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook