Rashmika Mandanna: గీతాగోవిందం ఫేమ్ రష్మిక మందన్నాకు అభిమానులు ఎక్కువౌతున్నారు. ఫోటో షూట్‌లతో , హావభావాలతో అభిమానగణాన్ని పెంచుకుంటూ సోషల్ మీడియాలో రికార్డు సృష్టిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో ప్రస్తుతం ఫేవరైట్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా(Rashmika mandanna)కు మోస్ట్ డిజైరబుల్ విమెన్‌గా పేరుంది. జాతీయ స్థాయిలో ఆమె అంటే ఇష్టపడేవారి సంఖ్య కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో రష్మిక మందన్నా..తనకు తిరుగులేదంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ఫోటో‌షూట్ ఫోటోల్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది కాబట్టే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఎక్కువ. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో రికార్డు సాధించింది.


20 మిలియన్ల అనుభూతి ఉంది..ఐ లవ్ యూ అనే క్యాప్షన్‌తో రష్మిక షేర్ చేసిన ఫోటో చాలా వైరల్ అవుతోంది. కేవలం అభిమానులే కాదు ఇతర హీరోహీరోయిన్లు సైతం ఆమెకు అబినందనలు తెలుపుతున్నారు. తెలుగులో పుష్ప(Pushpa movie), హిందీలో గుడ్ బై సినిమాలతో బిజిగా ఉన్న రష్మికను..మహానటి ఫేమ్ కీర్తి సురేష్ అభినందిస్తూ ట్వీట్ చేసింది.


Also read: పాగ‌ల్ ట్రైల‌ర్‌ విడుదల..విశ్వక్ సేన్ కుమ్మేశాడు భయ్యా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook