భారత అమ్ములపొదిలో అధునాత రాఫెల్ విమానాలు ( Rafale Aircrafts ) చేరడానికి మరికొన్ని గంటల వ్యవధి మిగిలింది. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాల ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు ( Restrictions in Ambala ) విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రాన్స్ నుంచి భారతదేశం కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలు మరి కొన్ని గంటల వ్యవధిలో ఇండియాకు చేరుకోనున్నాయి. తొలి విడతలో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి బయలుదేరాయి. మార్గమధ్యంలో ఎయిర్ ఫ్యూయల్  చేయించుకున్నాయి. దాదాపు 7 వేల 364 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం రేపు హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా అంబాలాలో ( Ambala ) భారీ ఆంక్షలు విధించారు.



బుధవారం నాడు అంబాలాకు చేరుకోనున్న నేపధ్యంలో అక్కడ నో ఫ్లై జోన్ ( No Fly Zone ) ప్రకటించారు. అంతేకాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లో  సెక్షన్ 144 విధించారు. జనం గుమిగూడకుండా...ఇళ్ల మిద్దెలపైకెక్కి ఫోటోలు తీయడం, వీడియో తీయడాన్ని సైతం పూర్తిగా నిషేధించారు. Also read: Rafale Aircrafts: త్వరలో భారత్ చేరుకోనున్న ఐదు రాఫెల్ విమానాలు


భారత వాయుసేనను ( Indian Airforce ) బలోపేతం చేసేందుకు మొత్తం 59 కోట్లతో 36 ఎయిర్ క్రాఫ్ట్ ను అందించేలా ఫ్రాన్స్ తో భారతదేశం ఒప్పందం చేసుకుంది. రాఫెల్ యుద్ధవిమానాల రాకతో భారతదేశ వాయుసేన మరింత శక్తివంతం కావడం ఖాయం. Also read: CAA: ఇంకెన్నాళ్లిలా ? పౌరసత్వం ఇవ్వండి దయచేసి