Crime News | అన్నా చెల్లెలి అనుబంధం అనేది జన్మజన్మల అనుబంధం. ప్రపంచంలో అన్నను మించిన రక్షకుడు లేడు అని నమ్మి రక్షాబంధన్ రోజు రాఖీ కడుతుంది చెల్లి.  రాకీ కట్టిన చెల్లెలికి బాకీగా తన ప్రాణం కూడా ఇవ్వడానికి వెనకాడదు సోదరుడు. ఇలాంటి అన్నాదమ్ములు ఉన్న ఈ రోజుల్లో.. రక్షించే బదులు రాక్షసుల్లా ప్రవర్తించే సోదరులు కూడా ఉంటారు. దానికి నిదర్శనమే ఈ తాజా ఘటన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Ghost Photo: వామ్మో... మీరు చూస్తోంది దెయ్యం ఫోటోనే


ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. సొంత చెల్లినే గన్నుతో కాల్చి చంపాడు ఒక కిరాతక సోదరుడు. కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వీధి కుక్కకు రొట్టెలు ఇవ్వలేదు అనే కోపంతో ఆశీష్ అనే వ్యక్తి తన చెల్లిని కాల్చి చంపాడు. హత్య చేసిన తరువాత పోలీసులకు లొంగిపోయాడు.


ఆశీష్ రియల్ ఎస్టేట్ డీలర్ కాగా సంఘటన జరిగే సమయంలో అతను తన సోదరి (Sister) పరుల్‌తో వీధి కుక్కల కోసం చెపాతీలు చేయమని కోరాడు. అయితే అలా చేయడానికి పరుల్ నిరాకరించింది. దీంతో ఆశీష్‌కు బాగా కోపం వచ్చింది. దాంతో అతను తన జేబులోంది గన్ను తీసి తన చెల్లి తల, మొడపై షూట్ చేశాడు. కాల్పులు జరిపిన వెంటనే పరుల్ ప్రాణం విడిచింది. 



Also Read | Honey: కల్తీ తేనె తీసుకుంటే అసలుకే మోసం, వెంటనే ఇలా టెస్ట్ చేయండి!


కాల్పుల శబ్దం విన్న తరువాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెళ్లి చూడగా రక్తంతో నిండిన పరుల్ భౌతిక దేహాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆశీష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook