నిత్యం ఏదో ఓ ప్రాంతంలో భవనాలు కుప్పకూలుతున్నాయి. కొన్నిచోట్ల నిద్రలోనే జీవితాలు తెల్లారిపోతున్నాయి. తాజాగా గుజరాత్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. వడోదర జిల్లా బవమన్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం (building collapsed in Vadodara) ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సులో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాణ్యతాలోపం వల్లే నిర్మాణంలో ఉండగానే భవనం కుప్పకూలిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!


Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్