India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శనివారం ( డిసెంబరు 19న ) దేశ వ్యాప్తంగా కొత్తగా 26,624 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 341 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,31,223 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,45,477 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా (Coronavirus) నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతోంది. శనివారం కరోనా నుంచి 29,690 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 95,80,402 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,05,344 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. Also read: KGF 2 teaser: కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్


ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,07,681 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 19వ తేదీ వరకు దేశంలో మొత్తం 16,11,98,195 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook