India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 70 వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు 60 వేలకు చేరువలో నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీల సంఖ్య కూడా నిత్యం గణనీయంగా పెరగడంతోపాటు.. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతూ వస్తోంది. గత 24గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 16న ) దేశవ్యాప్తంగా (India ) కొత్తగా.. 62,212 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 837 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం..దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,32,681 కి చేరగా.. మరణాల సంఖ్య 1,12,998 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Navratri Day 1: స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దేశవ్యాప్తంగా నిన్న కరోనా మహమ్మారి నుంచి 70,816 మంది కోలుకున్నారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 65,24,596 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 7,95,087 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 87.78 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.52 శాతం, యాక్టివ్ కేసుల రేటు 10.70 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. Also read: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?


ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 9,99,090 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 16 వరకు మొత్తం 9,32,54,017 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe