Coronavirus updates in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రోజూ నమోదయ్యే కేసులకన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో బుధవారం ( నవంబరు 11న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 47,905 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 550 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,83,917 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,28,121 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Gamanam Movie: ‘గమనం’ ట్రైలర్‌ విడుదల చేసిన పవన్ కల్యాణ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న కరోనాతో 52,718 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య దేశంలో 80,66,502 కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,89,294 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.89 శాతం ఉండగా.. మరణాల రేటు 1.48 శాతం ఉంది. Also read: Kajal, Gautam honeymoon pics: హనీమూన్‌‌లో కొత్త జంట.. కాజల్, కిచ్లు


ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 11,93,358 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 11 వరకు దేశంలో మొత్తం 12,19,62,509 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది.


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe