India Corona Cases: దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 3,962 కొత్త కరోనా కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మెుత్తం కేసుల సంఖ్య 4,31,64,544కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 26 కొత్త మరణాలు వెలుగు చూశాయి. మెుత్తం మరణాల సంఖ్య 5,24,677 చేరింది. దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. కొవిడ్ నుంచి కోలుకుని 2,697 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 4,26,25,454 కు చేరింది. రికవరీ రేటు 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ మెుత్తం  22,416 కరోనా యాక్టివ్ (Corona Active Cases in India) కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 4,45,814 మందికి కరోనా పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం 11,67,037 మందికి  టీకాలు (Covid-19 Vaccination) అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,93,96,47,071కు పెరిగింది. 


వరల్డ్ వైడ్ గా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 521,382 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కొత్తగా  1,161 మరణాలు నమోదయ్యాయి. ఉత్తర కొరియాలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం 80వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే అగ్రరాజ్యం అమెరికాలో 1,03,221 కొత్త కేసులు రాగా...మరో 316 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Satyendranath boss: గూగుల్ డూడుల్ గా సత్యేంద్ర నాథ్ బోస్‌.. భౌతిక, గణిత శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook