Satyendranath bose: గూగుల్ డూడుల్ గా సత్యేంద్ర నాథ్ బోస్‌.. భౌతిక, గణిత శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం

Satyendranath Bose: భారతీయ భౌతిక, గణిత శాస్త్రవేత్తకు సత్యేంద్ర నాథ్ బోస్ కు అరుదైన గౌరవం దక్కింది. గూగుల్ తన డూడుల్‌తో సత్యేంద్ర నాథ్ బోస్‌కు నివాళులర్పించింది. 98 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. అంటే జూన్ 4,  1924న తన  క్వాంటం సూత్రీకరణలపై తన పత్రాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు బోస్. క్వాంటం మెకానిక్స్‌లో ఇదో ముఖ్యమైన ఆవిష్కరణగా నిలిచింది.

Written by - Srisailam | Last Updated : Jun 4, 2022, 02:34 PM IST
  • గూగుల్ డూడుల్ గా సత్యేంద్ర నాథ్ బోస్‌
  • భౌతిక, గణిత శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం
  • 1924, జూన్4న ఐన్ స్టీన్ కు బోస్ పత్రం
Satyendranath bose: గూగుల్ డూడుల్ గా సత్యేంద్ర నాథ్ బోస్‌..  భౌతిక, గణిత శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం

Satyendranath Bose: భారతీయ భౌతిక, గణిత శాస్త్రవేత్తకు సత్యేంద్ర నాథ్ బోస్ కు అరుదైన గౌరవం దక్కింది. గూగుల్ తన డూడుల్‌తో సత్యేంద్ర నాథ్ బోస్‌కు నివాళులర్పించింది. 98 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. అంటే జూన్ 4,  1924న తన  క్వాంటం సూత్రీకరణలపై తన పత్రాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు బోస్. క్వాంటం మెకానిక్స్‌లో ఇదో ముఖ్యమైన ఆవిష్కరణగా నిలిచింది. అందుకే జూన్ 4న సత్యేంద్ర నాథ్ బోస్ ను స్మరించుకునేలా గూగుల్ తన డూడుల్ లో పెట్టింది.

భారత దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలో ఒకరైన సత్యేంద్రనాథ్ బోస్ 1894 జనవరి1న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జన్మించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన  హిందూ స్కూల్, ప్రెసిడెన్సీ కాలేజీలో చదివారు.
బోస్ కు చిన్నతనం నుంచే గణితంపై మక్కువ ఎక్కువ. దీంతో బోస్ తండ్రి కూడా అతన్ని గణితంపై ప్రోత్సహించారు. ప్రతి రోజూ ఒక అంక గణిత సమస్యను బోస్ కు ఇచ్చేవారు. తండ్రి ఇచ్చిన సమస్యను ఈజీగా పరిష్కరించేవారు బోస్. అలా అతను గణితంపై మరింతగా పట్టు  సాధించారు. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని చదివారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. డాకా విశ్వవిద్యాలయంలో (1921-45) ఆపై కలకత్తాలో (1945-56) బోధించాడు. గణితంపై బోస్ రాసిన అనేక శాస్త్రీయ పత్రాలు  1918 నుండి 1956 వరకు ప్రచురించబడ్డాయి. మెకానిక్స్, అయానోస్పియర్ యొక్క విద్యుదయస్కాంత లక్షణాలు, ఎక్స్-రే క్రిస్టల్లాగ్రఫీ మరియు థర్మోల్యూమినిసెన్స్ సిద్ధాంతాలను బోస్ రచించారు. బోస్ రాసిన ప్లాంక్ యొక్క చట్టం మరియు లైట్ క్వాంటా యొక్క పరికల్పన పత్రాలను తన పరిశోధనల కోసం ఉపయోగించున్నారు ఐన్‌స్టీన్‌.

సత్యేంద్రనాథ్ బోస్ బిఎస్సీలో  అనువర్తిత గణితశాస్త్రంను ప్రధాన విషయంగా తీసుకొని 1913 లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1915 లో అనువర్తిత గణిత శాస్త్రంలో ఎంఎస్సీని ప్రథమ స్థానంలో పూర్తి చేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డు స్పష్టించారు. ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ అధిగమించలేదు. ఎంఎస్సీ పూర్తి చేసిన తర్వాత 1916లో కలకత్తా విశ్వవిద్యాలయంలో పరిశోధకునిగా చేరాడు. 1916 నుండి 1921 వరకు భౌతిక విభాగంలో అధ్యాపకునిగా పనిచేశారు. మేఘనాథ్ సాహాతో పాటు బోస్ 1919 లో ఐన్‌స్టీన్ ప్రత్యేక, సాధారణ సాపేక్షతపై రాసిన పత్రాల జర్మన్, ఫ్రెంచ్ భాషా అనువాదాల ఆధారంగా ఆంగ్లంలో ప్రచురితమయ్యాయి.సాపేక్ష సిద్ధాంతపై పరిశోధనలు చేశారు. బెంగాలీ, ఆంగ్లం, ప్రెంచ్, జర్మన్, సంస్కృతం భాషల్లోనూ బోస్ రచనలు ఉన్నాయి. వయొలిన్ ను పోలి ఉండే ఎస్రాజ్ వాయించేవారు బోస్.

1924 లో ఢాకా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగంలో రీడర్‌గా పనిచేస్తున్నప్పుడు.. భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమంపై  పరిశోధనా పత్రాన్ని రాశారు.ఈ పత్రం క్వాంటం గణాంకాల రంగంలో కీలకంగా మారింది.అయితే దీని ప్రచురణకు సంస్థలు అంగీకరించలేదు. దీంతో బోస్ ఆ పత్రాన్ని జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు. బోస్ పంపిన పత్రాన్ని చదివిన ఐన్ స్టీన్.. దానిని జర్మన్ భాషలోకి అనువదించారు. బోస్ తరపున ప్రతిష్టాత్మక జీట్స్‌క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్‌కు సమర్పించారు. దీంతో బోస్ కు యూరోపియన్ ఎక్స్-రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలలలో  పనిచేసే అవకాశం దక్కింది. ఈ సమయంలోనే బోస్.. లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్‌స్టీన్‌లతో కలిసి పనిచేశారు.

సత్యేంద్రనాథ్ బోస్ స్వయం బోధకుడు,బహుభాషా కోవిదుడు. భౌతిక, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, జీవ శాస్త్రము, లోహ సంగ్రహణ శాస్త్రము, తత్వ శాస్త్రము, కళలు, సాహిత్యం, సంగీతం వంటి అనేక రంగాలలో కృషి చేశారు. బోస్ యొక్క సైద్ధాంతిక పత్రం క్వాంటం సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన అన్వేషణలలో ఒకటిగా మారింది. భౌతిక శాస్త్రానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో 1954లో సత్కరించింది.

READ ALSO: CLUB MUSTI PUB: కూకట్ పల్లి క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అండతోనే గబ్బు?

READ ALSO: Dead Body in JNU: జేఎన్‌యూలో డెడ్ బాడీ కలకలం... చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News