India COVID-19 Cases | కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ ఒకటి. దేశంలో మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు కేసులు నమోదయ్యాయి. దాదాపు 60 దేశాలకు కరోనా వ్యాక్సిన్లు, కిట్లు పంపించిన భారత్‌ నేడు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఏదో ఓ మూల ఆక్సిజన్ అందక పోయే ప్రాణాల సంఖ్య పెరిగిపోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,65,428 శాంపిల్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 4,03,738 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,22,96,414కు చేరింది. అదే సమయంలో 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే దేశంలో 4,092 మందిని కోవిడ్19 మహమ్మారి బలితీసుకుంది. భారత్‌లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,42,362కి పెరిగింది. 


Also Read: RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల



దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,86,444 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 37 లక్షల 36 వేల 648 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ కేసులు సైతం దాదాపు పాజిటివ్ కేసులతో సమానంగా ఉండటం స్వల్ప ఊరట కలిగిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,83,17,404కి చేరింది. మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 16 కోట్ల 94 లక్షల 39 వేల 663 మంది కోవిడ్19(COVID-19) టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.


Also Read: CT Scan For COVID Patients: సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్ సంచలన విషయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook