India Corona Update: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. మొన్నటి వరకూ గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న అన్‌లాక్ ప్రక్రియ కారణంకా కరోనా సంక్రమణ మరోసారి పెరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వైరస్(Corona virus)కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కన్పించింది. మొన్నటి వరకూ కరోనా వైరస్ సంక్రమణ చాలావరకూ తగ్గినా..కొద్దిరోజుల్నించి మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్న 37 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఇవాళ 43 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 శాతం అధికంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళ నుంచే కావడం విశేషం. దేశంలో గత 24 గంటల్లో 43 వేల 263 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య దేశంలో 3 కోట్ల 31 లక్షల 39 వేల 981గా ఉంది. ఇందులో 3 లక్షల 93 వేల 614 కేసులు యాక్టివ్‌గా ఉంటే..4 లక్షల 41 వేల 749 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 3 కోట్ల 23 లక్షల 4 వేల 618 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 338 మంది కరోనా కారణంగా మరణించారు. అటు 40 వేల 567 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 71 కోట్ల 65 లక్షల 97 వేల 428 మందికి కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ఇచ్చారు. 


Also read: Rajyasabha Bypoll: రాజ్యసభ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook