India Corona Update: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన రేపుతోంది. వరుసగా రెండవరోజు కూడా 40 వేలు దాటి కేసులు నమోదైన పరిస్థితి కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దాదాపు తగ్గిపోతుందనుకుంటున్న దశలో సంక్రమణ మళ్లీ వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా చాలారోజుల్నించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 35-38 వేల మధ్య నమోదయ్యేది. అయితే గత రెండ్రోజుల్నించి పరిస్థితిలో మార్పు వచ్చింది. గత రెండు రోజులుగా రోజుకు 43 వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 43 వేల 509 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బుల్లెటిన్ వెల్లడించింది. ఇందులో ఒక్క కేరళ నుంచే 22 వేల కేసులుండటం గమనార్హం. కేరళలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 3 వేల 840 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 3 కోట్ల 7 లక్షల 1 వేయి 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


ఇక వ్యాక్సినేషన్‌కు సంబంధించి..దేశంలో 45.7 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. గత 24 గంటల్లో 17 లక్షల 28 వేల 795 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)నిర్వహించగా..ఇప్పటి వరకూ దేశంలో 46 కోట్ల 26 లక్షల 29 వేల 773 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో 97.38 శాతం రికవరీ రేటు ఉంది. 


Also read: Kerala Lockdown: కేరళలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా ఉధృతి, సంపూర్ణ లాక్‌డౌన్‌కు నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook