Narendra modi: ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించారు. సామాజిక మాధ్యమంలో యాక్టివ్‌గా ఉండే నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లతో రికార్డు సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలో అత్యంత ప్రజాకర్షక నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) ఒకరు. సామాజిక మాధ్యమంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. అలాగే అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లతో రికార్డు సాధించారు. ట్విట్టర్‌(Twitter)లో 7 కోట్ల ఫాలోవర్లు సాధించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో నరేంద్ర మోదీ ట్విట్టర్ అక్కౌంట్ తెరిచారు. 2010 వరకూ లక్షమంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత పదకొండేళ్లలో ఏకంగా 7 కోట్లమంది ఫాలోవర్స్‌ను సాధించుకున్నారు. భారతదేశ ప్రధాని అయిన తరువాత నరేంద్రమోదీని ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మోదీ సోషల్ మీడియాను ఓ వేదిక చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central government)చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు అంశాలపై స్పందిస్తుంటారు. 


Also read: ఈపీఎఫ్ నుంచి లక్ష రూపాయలు మెడికల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం..ఎలాగంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook