వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆర్బీఐ (RBI ) తన చెక్ పేమెంట్ విధానంలో మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో మనం రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బును చెల్లించే లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ మార్పులు, జాగ్రత్తలు అనేవి వ్యక్తిగత నిర్ణయంతో మాత్రమే ఒక వ్యక్తి అమలు చేసే అవకాశం ఉంది. చెక్ పేమెంట్స్ విషయంలో జరిగే మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Gold Monetisation Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి


పాటిటీవ్ పే సిస్టం అమలు
జనవరి 1, 2021 నుంచి పాజిటీవ్ పే సిస్టమ్ ( Positive Pay System ) అందుబాటులోకి రానుంది. అంటే ఈ సిస్టమ్ లో భాగంగా 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో పేమెంట్ చేయడంపై రెండోసారి కన్ఫర్మ్.. అంటే రీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిస్టం ద్వారా చెక్ ను ఎస్సెమ్మెస్, మొబైయిల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ( Internet Banking  ), ఏటియం ( ATM )  ద్వారా కన్ఫర్మేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చెక్ పై ఉన్న తేదీ, పేమెంట్ చేసే వ్యక్తి పేరు, పెయి, డబ్బు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.


పై వివరాలను బ్యాంకు తరపున కూడా మళ్లీ కన్ఫర్మ్ చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానాస్పద అంశాలు పరిశీలనకు వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పులు కూడా వెంటనే సవరించే అవకాశం ఉంటుంది.



ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి


ఆర్భీఐ ప్రకారం బ్యాంకులు తమ వినియోగదారులకు ఎస్సెమ్మెస్ ఆలెర్ట్,  బ్రాంచుల్లో ప్రదర్శన, ఏటిఎంతో పాటు తమ వెబ్ సైట్ లో పాజిటీవ్ పే సిస్టమ్ గురించి ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. ఈ సిస్టం ప్రకారం అన్ని లక్షణాలు ఉన్న చెక్ లను మాత్రమే పేమెంట్ కోసం పంపించడం జరుగుతుంది. సమస్యాత్మక లావాదేవీలు సీటీస్ లో స్వీకరించి దర్యాప్తు నిర్వహిస్తారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR