Road Accident in BG Halli Chitradurga district Karnataka | బెంగళూరు: కర్ణాటకలో రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని (Karnataka) చిత్రదుర్గ జిల్లాలో బీజీ హల్లిలో శనివారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్‌ నుంచి బెంగళూరుకు 11 మందితో వెళ్తున్న క్రూయిజర్‌ను.. బెంగళూరు నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఢీ కొట్టింది. ఆదివారం తెల్లవారుజామున బీజీ హళ్లి (BG Halli Chitradurga) వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరో ఇద్దరి పరస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి (Road Accident) అతివేగం, నిద్రమత్తు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Telangana: ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య


Also read: Corona Second Wave In Telangana: కరోనా సెకండ్ వేవ్.. జర జాగ్రత్త!: ఈటల రాజేందర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook