Corona Compensation: కరోనా మృతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona pandemic)కారణంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలు చాలావరకూ రోడ్డున పడ్డాయి. ఈ నేపధ్యంలో కరోనా మృతులకు పరిహారంగా 4 లక్షలు చెల్లిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం(Central government) తరువాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మృతులకు పరిహారం చెల్లించే పిటీషన్‌పై జస్టిస్ అశోక్ భూషన్ దర్మాసనం తీర్పు వెల్లడించింది.


కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు(Supreme Court). కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్టపరిహారమనేది కేంద్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపింది.చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదన్న కేంద్ర వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం కచ్చితంగా చెల్లించాల్సిందేనంది. అయితే తమ వద్ద తగిన నిధులు లేవన్న కేంద్ర వాదనను కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎంత పరిహారం(Corona compensation) ఇవ్వాలనేది కేంద్రమే నిర్ణయించి 6 వారాల్లోగా విధివిధానాలు సిద్ధం చేయాలని సూచించింది. విపత్తులో చనిపోయినవారికి నష్టపరిహారం ఇవ్వాలని సిఫారసు చేయడంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ  విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.


Also read: India COVID-19 Cases: ఇండియాలో మరోసారి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, భారీగా పెరిగిన రికవరీ రేటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook