Coronavirus second wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందా ? మంత్రి ఈటల మాటేంటి ?

Sun, 22 Nov 2020-3:50 am,

తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వస్తుందా అంటే వచ్చే అవకాశం ఉండకపోవచ్చనే అంటున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కరోనావైరస్‌‌ను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం అన్నివిధాల సిద్ధంగా ఉందని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. '' ప్రతి రోజూ 50 వేల మందికి కరోనా పరీక్షలను ( COVID-19 tests ) నిర్వహిస్తున్నాం'' అని తెలిపారు.

తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించడానికి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం వైపు నుంచి కూడా అనుమతులు లభించాలని కోరుకుంటున్నట్టు ట్రస్మా ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.

విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని... అవసరమైతే స్కూళ్లలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్-2020 పేరుతో 'సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్' ( Safe reopening of schools ) అంశంపై శనివారం జరిగిన ఓ సమావేశానికి హాజరై మాట్లాడుతూ మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also read : GHMC Elections: రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఆందోళన.. కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

పాఠశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను మిగతా విద్యార్థులతో కలవకుండా హోమ్ క్వారంటైన్ పాటిస్తూ ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకునే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. 

Also read : GHMC Elections: రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఆందోళన.. కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link