Gold Price Today 13 April 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Tue, 13 Apr 2021-8:33 am,

Gold Price Today In Hyderabad 13 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పెరగగా, ఢిల్లీలో పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 13, 2021, ఓ రాశివారికి ధనలాభం

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు పుంజుకున్నాయి. తాజాగా రూ.150 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,510కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,550 అయింది.

Also Read: Ugadi 2021 Wishes In Telugu: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రూ.50 మేర స్వల్పంగా పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,860 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,700 వద్ద మార్కెట్ అవుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు పెరిగాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.300 మేర ఎగసింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.67,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 మేర పెరిగింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,900కి చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link