Viral Video: సీటు కోసం రైలులో పెద్ద యుద్ధమే జరిగింది. ఎంతలా అంటే మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతలా చోటుచేసుకుంది. ఈ ఘటన ముంబై లోకల్ రైలులో జరిగింది. ఈఘటనను కొందరు ఫోన్‌లో చిత్రీకరించారు. మరికొందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మరో పాని పట్టు యుద్ధం అంటూ షేర్లు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థానే-పన్వెల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఈదృశ్యాలు కనిపించాయి. మహిళలు పరస్పరం జట్టు పట్టుకుని లాగుకున్నారు. వారిని ఆపేందుకు శారద ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్‌ ప్రయత్నించింది. ఈనేపథ్యంలో ఆమెకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. సీటు విషయంలోనే మాట మాట పెరిగి గొడవకు దారి తీసినట్లు తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఇందులో పలువురు మహిళలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు మీడియాకు వివరించారు. 



Also read:IND vs SA: ఆఖరి ఓవర్‌లో నా గేమ్‌ ప్లాన్ అదే..సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Also read:Minister KTR: రాబోయే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్..మా స్కెచ్ అదేనన్న మంత్రి కేటీఆర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook