ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే గుర్తొచ్చే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఒకటి. IPL 2020కు తాము సిద్ధమని ప్రత్యర్థి జట్లకు చెన్నై సంకేతాలిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో అరబ్ స్టైల్ ఆహార్యంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni)కెప్టెన్సీ చేస్తున్న చెన్నై జట్టు దర్శనమిచ్చింది. దుబాయ్ ప్లాన్ వాయిదాపడితేనేం హబీబీ మూడ్‌లోనే మా జట్టు అంటున్నట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. BCCI: సౌరవ్ గంగూలీ దాదాగిరి ముగిసిందా?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

53 రోజులపాటు యూఏఈ వేదికగా జరగననున్న ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ 13 సీజన్ విజేత సగర్వంగా కప్పు అందుకోనుంది. ఏడాదిన్నర సమయం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగుపెడతానన్న ఆలోచనతో చెన్నై టీమ్ ఫ్యాన్స్, ఎంఎస్ ధోనీ అభిమానులు సోషల్ మీడియాలో సందడి షురూ చేశారు. IPL ఫైనల్ తేదీ మార్పు.. 13 ఏళ్లలో తొలిసారిగా!


ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్ ఆడిన జట్టుగా, క్వాలిఫయర్స్‌కు ఎక్కువసార్లు వెళ్లిన జట్టు కావడం.. భారత జట్టుకు ప్రపంచ కప్‌లు అందించిన ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండటంతో సీఎస్కే జట్టు ఎప్పటికీ టైటిల్ ఫెవరెట్ అనడంలో ఏ సందేహం అక్కర్లేదు.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...