Anil Kumble: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్  అనిల్ కుంబ్లే..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఏపీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) క్యాంపు కార్యాలయంలో ఇవాళ కీలకమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్, ప్రముఖ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన అనిల్ కుంబ్లే..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ...ఏపీలో కలవడం క్రీడావర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అనిల్ కుంబ్లే ఇప్పటికే బీసీసీఐలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. మర్యాదపూర్వక భేటీ అని ముఖ్యమంత్రి క్యాంపు వర్గాలు చెబుతున్నప్పటికీ వేరే కారణం లేకపోలేదనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ సందర్బంగా అనిల్ కుంబ్లే(Anil Kumble)..వైఎస్ జగన్‌కు క్రికెట్ ఫోటోలకు సంబంధించిన ఫోటో ఫ్రోమ్ జ్ఞాపికను అందజేశారు. 


Also read: IPL 2021 Latet News: ఐపీఎల్ కోసం భారీ వ్యూహాలు రచిస్తోన్న BCCI, పలు కీలక నిర్ణయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook