Bhoiguda fire mishap: సికింద్రాబాద్‌ బోయగూడలోని.. గోడౌన్​లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరగటం బాధకారమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున నష్టపరిహారం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్మికుల మృతి వారి కుటుంబాలకు తీరనిలోటన్నారు ప్రధాని. ఈ కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.


మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు..


గోడౌన్​లో షార్ట్ సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. 11 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.


పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ పరిహారం చెల్లించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్​ చేసింది.



ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Also read: Bhoiguda fire accident: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్పందన- బాధితులకు నష్ట పరిహారం ప్రకటన


Also read: Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook