Budida Bikshamaiah Goud: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుల ద్వయంపై బూడిద భిక్షమయ్య గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్లిద్దరూ కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. వాళ్ళు కోవర్ట్ బ్రదర్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబ్బులతోనే రాజకీయం చేయొచ్చని ఉమ్మడి నల్లగొండ రాజకీయాలను భ్రష్టు పట్టించిన నేతలుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులను అభివర్ణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీరి పనిచేస్తే.. ఇంకొక సోదరుడు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల కోసం పార్టీ మారాడు అని బిక్షమయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. గురువారం బీజేపికి గుడ్ బై చెప్పి తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిక్షమయ్య గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఉమ్మడి నల్గొండ జిల్లాలో గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేతలను, ఇతర బడుగు బలహీన వర్గాల నాయకులను రాజకీయంగా సమాధి చేసిన మనుషులు కోమటిరెడ్డి బ్రదర్స్ అని బిక్షమయ్య గౌడ్ మండిపడ్డారు. నోట్ల కట్టలతోనే రాజకీయాలు చేయొచ్చని భావిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు నల్గొండ జిల్లా ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. ఒక బిసి బిడ్డగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓటర్లను కోరుతున్నది అదొక్కటే అని విజ్ఞప్తి చేశారు. 


కోమటిరెడ్డి బ్రదర్స్ 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనుల కోసం మునుగోడును అమ్ముకున్నారు అని ఆగ్రహం వ్యక్తంచేసిన బిక్షమయ్య గౌడ్.. మునుగోడులో మరొకసారి గెలిస్తే... ఈసారి ఏకంగా లక్ష కోట్లకు నల్గొండ జిల్లానే అమ్ముకుంటారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులను ఎద్దేవా చేశారు. 


దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. ఒక బ్రోకర్‌ను, పొలిటికల్ కాంట్రాక్టర్‌ను పార్టీలో ఎందుకు చేర్చుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి బ్రోకర్ బ్రదర్స్‌కి బుద్ధి చెప్పడం కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి కోసం టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తానని బూడిద భిక్షమయ్య గౌడ్ స్పష్టంచేశారు. 


కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంటే బూడిద భిక్షమయ్య గౌడ్‌కి అంత కోపం ఎందుకంటే
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులపై బూడిద బిక్షమయ్య గౌడ్‌కి మరీ అంత కోపం ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను నల్గొండ రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలోనే బీసి బిడ్డనైన తనపై కోమటిరెడ్డి బ్రదర్స్ కుట్రచేసి 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యేలా చేశారనేది బిక్షమయ్య గౌడ్ ప్రధాన ఆరోపణ. బీసీ నాయకుడినైన తనను నల్గొండ రాజకీయాల్లో ఎదగకుండా అడ్డుపడింది కోమటిరెడ్డి బ్రదర్సేననే కోపం ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కారణంగానే 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి బీజేపిలో చేరారు. మళ్లీ ఇప్పుడిలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఊహించని విధంగా బీజేపిలో చేరడంతో భిక్షమయ్య గౌడ్ బీజేపికి గుడ్ బై చెప్పి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy ) ఓటమే లక్ష్యంగా మరోసారి టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు.


Also Read : Budida Bikshamaiah Goud: బీజేపికి బూడిద భిక్షమయ్య గౌడ్ గుడ్ బై.. పార్టీపై సంచలన ఆరోపణలు


Also Read : Revanth Reddy: పదవి నుంచి దించేందుకు కేసీఆర్‌తో కుమ్మక్కైన మా పార్టీ నేతలు.. కన్నీటి పర్యంతమైన రేవంత్


Also Read : Munugode Bypoll: డబ్బుల్లిచ్చి అల్లరి చేయిస్తున్నారా.. కోమటిరెడ్డికి అడగడుగునా అడ్డంకులెందుకు? మునుగోడులో అసలేం జరుగుతోంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి