తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ ఐదుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,35,656కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,324కి చేరింది. చికిత్స అనంతరం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న బాధితుల సంఖ్య  2,16,353గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 14,938 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. బుధవారం ఒక్కరోజే 41,962 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 288 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు.



 


కాగా, భారత్‌లో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో 0.56శాతం మాత్రమే ఉండటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 41,96,958 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe